1600 సంవత్సరంలో స్థాపించబడిన ఈస్టిండియా కంపెనీ , వ్యాపారం చేయడానికి వచ్చి భారత్నే ఆక్రమించుకుంది. దాదాపు రెండు శతాబ్దాలకుపైగా ఇండియాను పాలించిన ఈస్టిండియా , అప్పుడు అణా , అర్థణా పేరిట నాణేలను ప్రవేశపెట్టింది.
రాగి , ఇత్తడి , బంగారం వంటి లోహాలు అందులో ఇమిడివుండేవి. అందుకే నాణేలు మెరవడమేకాదు బరువు కూడా అలాగే వుండేవి వాటిలో ఒకటి ఒక అణా. బ్రిటీషర్స్ ఇండియాకు రావడానికి ముందున్న నాణేల్లో రాముడి నాణెం ముఖ్యమైంది.
తెల్లదొరల పాలనలో రాముడి నాణేలు పోయి ఈస్టిండియా కాయిన్స్ వచ్చాయి. కాలగర్భంలో అవన్నీ కలిసిపోయినా వాటికి సంబంధించి ఫోటోలు నేటికీ నెటిజన్లను ఆకట్టుకోవడం గమనార్హం. కాలగర్భంలో కలిసిన పోయిన ఈ నాణేలకు నేటికీ డిమాండ్ ఎక్కువే!
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment