ఇంట్లో బంధించి అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్‌రేప్ - News




కాన్పూర్ (ఉత్తరప్రదేశ్): ఓ దళిత కుటుంబంలోని ఇద్దరు అక్కాచెల్లెళ్లను వారింట్లోనే బందీలుగా చేసి మూడు రోజులపాటు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఘోర సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఇందులో ఒకరు మైనర్ బాలిక. పొరుగున ఉంటున్నవారే ఈ దురాగతానికి పాల్పడ్డారు. ఈ నెల 17న చోటు చేసుకున్న ఈ ఘటన శుక్రవారం వెలుగుచూసింది.
 
 నలుగురు అక్కాచెల్లెళ్లతో కూడిన ఓ దళిత కుటుంబం కాన్పూర్ దెహత్ జిల్లా మహరాజ్‌పూర్ గ్రామంలో నివాసం ఉంటోంది. తండ్రి కాన్పూర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇంట్లో నలుగురు అక్కాచెల్లెళ్లు మాత్రమే ఉండడం చూసిన పంకజ్, అమిత్, వివేక్‌సింగ్ అనే ముగ్గురు కామాంధులు లోనికి చొరబడి అఘాయిత్యానికి పాల్పడ్డారు.
 
 అజ్ఞాత ప్రదేశంలోకి నన్
 పశ్చిమబెంగాల్‌లో సామూహిక అత్యాచారానికి గురైన 71ఏళ్ల నన్ శుక్రవారం తెల్లవారుజామున ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆ తర్వాత ఆమె అజ్ఞాత ప్రదేశంలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు.

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment