¤ స్వాతంత్య్రానంతరం 1952లో కొలువుదీరిన మొదటి లోక్సభకు ఎంపికై, ఇప్పుడు కూడా పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతూ, అరుదైన రికార్డు సొంతం చేసుకున్న 95 సంవత్సరాల రిషాంగ్ కీషింగ్ ఇక రాజకీయాల నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. » రిషాంగ్ కీషింగ్ ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.ఆయన రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్తో ముగియనుంది. | |
» సోషలిస్టు పార్టీ టికెట్పై 1952లో లోక్సభకు ఎన్నికైన కీషింగ్, నెహ్రూ ఆహ్వానం మేరకు 1962లో కాంగ్రెస్లో చేరాడు. అప్పటి నుంచి కాంగ్రెస్లోనే కొనసాగుతున్నాడు. మణిపూర్ సీఎంగా కూడా పనిచేశాడు. |
¤ అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్పర్సన్గా ప్రముఖ ఆర్థికవేత్త జెనెత్ ఎలెన్ (67) ప్రమాణస్వీకారం చేశారు. » ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థికవ్యవస్థకు చెందిన కేంద్రబ్యాంక్ ఛైర్పర్సన్ బాధ్యతలను ఒక మహిళ చేపట్టడం ఇదే తొలిసారి. » ఈ పదవిలో ఎలెన్ నాలుగేళ్లు ఉంటారు. | |
» అమెరికా ఆర్థికవ్యవస్థ మళ్లీ సంక్షోభంలో చిక్కుకోకుండా, ఉద్దీపనల భారాన్ని తగ్గించడం ఎలెన్ భుజస్కందాలపై ఉన్న అత్యంత కీలకమైన బాధ్యత. » బెన్ బెర్నాంకే స్థానంలో ఆమె నియమితులయ్యారు. |
ఫిబ్రవరి - 4
|
¤ గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలేనికి చెందిన దొంతా రవితేజ నేతృత్వంలో రూపొందించిన కారు మనీలా మారథాన్ పోటీలకు ఎంపికైంది. » ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఈ నెల 6 నుంచి 9 వరకు జరగనున్న 'షెల్ ఎకో మారథాన్ 2014' పోటీల్లో దేశ విదేశాలకు చెందిన విద్యార్థులు తమ నూతన పరిశోధనల ద్వారా రూపొందించిన కార్లను పోటీలో ప్రదర్శించనున్నారు. » 2009 నుంచి ఆసియాలో షెల్ ఎకో మారథాన్ పోటీలను నిర్వహిస్తున్నారు. డీజిల్, పెట్రోల్, హైడ్రోజన్, బ్యాటరీ.. ఇలా వివిధ ఇంధనాలతో ఎక్కువ దూరం ప్రయాణించే కార్లను రూపొందించి, ఏటా ఈ మారథాన్లో ప్రదర్శిస్తారు. » దేశవ్యాప్తంగా 80 మంది పోటీల్లో పాల్గొనగా, 17 మంది మనీలాలో జరిగే పోటీలకు ఎంపికయ్యారు. వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన రవితేజ ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల బృందం కూడా ఉంది. » రవితేజ ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలోని అంబేద్కర్ యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. రవితేజ తన బృందంతో కలిసి మూడు నెలలపాటు కష్టపడి 'దక్ష్' అనే పేరుతో కారును రూపొందించాడు. |
ఫిబ్రవరి - 5
|
¤ లోక్సభలో బీజేపీ పక్షనాయకురాలు సుష్మాస్వరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'చప్పిడి ముక్కులు' అంటూ ఈశాన్య రాష్ట్రాల ప్రజలను అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. » ఢిల్లీలో హత్యకు గురైన అరుణాచల్ప్రదేశ్ కు చెందిన విద్యార్థి నిడో తానియమ్ తరపున ఆమె మాట్లాడుతూ 'ఢిల్లీ ప్రజల బాగోగుల కంటే రోడ్డెక్కి ధర్నా చేయడమే వారికి ప్రధానమైపోయింది' అని కేజ్రీవాల్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సమయంలోనే 'పొడవు ముక్కుల వారిలాగే, చప్పిడి ముక్కుల వారూ ఈ దేశ పౌరులే' అని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తన తప్పు తెలుసుకుని ఈశాన్య భారతీయులకు సుష్మాస్వరాజ్ క్షమాపణలు చెప్పారు. » పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే లోక్సభలో ఈ ఘటన చోటు చేసుకుంది. |
| ¤ ప్రపంచంలో అత్యంత శక్తిమంత 50 మంది వ్యాపార మహిళలతో ఫార్చ్యూన్ పత్రిక రూపొందించిన జాబితాలో భారత్కు చెందిన పెప్సికో సీఈఓ ఇంద్రానూయి, ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) చందాకొచ్చర్లకు స్థానం లభించింది. | |
మేరీబారా | |
| » ఫార్చ్యూన్ వ్యాపార మహిళల జాబితాలో రెండోస్థానంలో ఐబీఎం ఛైర్మన్, సీఈఒ ప్రెసిడెంట్ జిన్నీ రొమెట్టీ ఉన్నారు. |
» జాబితాలో ఇంద్రానూయికి 3వ స్థానం కొచ్చర్కు 18వ స్థానం దక్కింది.¤ సెబీ ఛైర్మన్గా ఉన్న యు.కె.సిన్హా పదవీకాలన్ని ప్రభుత్వం మరో రెండేళ్లపాటు పొడిగించింది. » పదవీకాలం పొడిగింపు ఫిబ్రవరి 18 నుంచి అమల్లోకి రానుంది. సిన్హా గత మూడేళ్లుగా సెబీ ఛైర్మన్గా ఉన్నారు. » ఇప్పటివరకు డి.ఆర్.మెహతా మాత్రమే సెబీకి అత్యధిక కాలం (1995-2002) ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. » సెబీ ఛైర్మన్గా సిన్హా స్టాక్ మార్కెట్లలో అనేక కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. |
ఫిబ్రవరి - 10
|
¤ ప్రతిష్ఠాత్మక సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ సంచాలకులుగా మన రాష్ట్ర కేడర్కు చెందిన అరుణా బహుగుణ బాధ్యతలు చేపట్టారు. » 1979 బ్యాచ్కు చెందిన అరుణా బహుగుణా ఇప్పటివరకు సీఆర్పీఎఫ్ ప్రత్యేక సంచాలకులుగా ఢిల్లీలో విధులు నిర్వర్తించారు. | |
» ఐపీఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చే హైదరాబాద్లోని ఈ సంస్థకు సంచాలకులుగా ఒక మహిళా అధికారి నియమితులు కావడం ఇదే ప్రథమం.¤ భారత్లో రసాయన శాస్త్ర విద్యాభివృద్ధి కార్యక్రమానికి 'సిప్లా' ఛైర్మన్ యూసుఫ్ హమీద్ రూ.8 కోట్లు విరాళంగా ఇచ్చారు. |
¤ ఉత్తరాఖండ్కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి అభిలాష్ సెంవాల్ బాంబులను గుర్తించే ఒక చిప్ను రూపొందించాడు. ఈ చిప్ మొబైల్లో వినియోగిస్తే మొబైల్ బాంబ్ డిటెక్టర్గా మారుతుందని వెల్లడించాడు. » ఈ ఆవిష్కరణకుగాను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ రూ.5 లక్షల నగదు బహుమతిని అభిలాష్కి ప్రకటించారు. | |
¤ రాష్ట్ర ఉప లోకాయుక్తగా మహబూబ్నగర్ జిల్లాజడ్జి టి.గంగిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. » లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు.¤ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలుగుతేజం జస్టిస్ నూతలపాటి వెంకట రమణ ప్రమాణ స్వీకారం చేశారు. » ఆయనతో పాటు మరో జడ్జి రాజేశ్కుమార్ అగర్వాల్ చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం ప్రమాణ స్వీకారం చేయించారు. » వీరిద్దరి చేరికతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 31కి చేరింది. » జస్టిస్ వెంకట రమణ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, జస్టిస్ అగర్వాల్ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తూ, పదోన్నతి పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. |
¤ బ్రహ్మకుమారీల సంయుక్త చీఫ్ రాజయోగిని దాదీ రతన్మోహినీజీ కి గుల్బర్గ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది.
| |
| ¤ భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త రీతూపర్ణ బోస్ అమెరికాలో చరిత్ర పూర్వయుగం నాటి జీవజాలాన్ని పునర్నిర్వచించేలా ఒక కీలక పరిశోధన నిర్వహించారు. » ఓహియో, మిచిగన్ ప్రాంతాల్లో లభించిన శిలాజాలపై అధ్యయనం చేసిన ఆమె ఆ శిలాజాలు సుమారు 40 కోట్ల ఏళ్లనాటివని గుర్తించారు. |
» ఈ శిలాజాలను గుర్తించేందుకు 'జియోమెట్రిక్ మార్ఫోమెట్రిక్స్' పేరుతో సరికొత్త పద్ధతిని ఆమె ఆవిష్కరించారు. » సాధారణంగా డీఎన్ఏ సీక్వెన్సింగ్ ద్వారా శిలాజాలను గుర్తించడం కచ్చితత్వంతో కూడి ఉంటుంది. కానీ, చాలా శిలాజాల్లో డీఎన్ఏ సేకరించడం కష్టమవుతుంది. కాబట్టి, అలాంటి వాటికి తాను ఆవిష్కరించిన పద్ధతి ఉపయుక్తంగా ఉంటుందని ఆమె ప్రకటించారు. » రీతూపర్ణ ఆవిష్కరించిన పద్ధతిని పలు అంతర్జాతీయ జర్నల్లు, యూనివర్సిటీలు ప్రశంసించాయి. |
ఫిబ్రవరి - 21
|
¤ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్పర్సన్ అర్చనా భార్గవి తన పదవికి రాజీనామా చేశారు. » మొండిబకాయిల వెల్లడికి సంబంధించి ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్పై దర్యాప్తు మొదలైన నేపథ్యంలో ఆమె రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
|
| ¤ దాదాపు 3 లక్షల మంది సిబ్బందితో దేశ భద్రతలో ప్రధాన భూమిక పోషిస్తున్న కేంద్ర పారామిలిటరీ బలగాల (సీఆర్పీఎఫ్) సేవలను కొనియాడుతూ, ప్రఖ్యాత బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ ప్రత్యేక గీతాన్ని రచించారు. |
» 'హం హే దేశ్కే రక్షక్' అంటూ సాగే ఈ గీతాన్ని సీఆర్పీఎఫ్ 75వ ఆవిర్భావ దినోత్సవమైన ఫిబ్రవరి 28న రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ఆవిష్కరించనున్నారు. |
¤ మాదక ద్రవ్యాల మాఫియా డాన్ జోక్విన్ అలియాస్ గజ్మాన్ను మెక్సికో సముద్ర తీర దళం అరెస్టు చేసింది. | |
» జోక్విన్ మెక్సికోలోని 'సినాలోవా' అనే ప్రాంతంలో మాఫియా సంస్థను నడుపుతున్నాడు. పదేళ్లుగా పలు నేరాలకు పాల్పడి, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత, వ్యవస్థీకృత నేరాల నిర్వాహకుడిగా, కిరాయి హంతకుడిగా పేరుగాంచాడు. » ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రకటించిన వందల కోట్ల విలువైన ఆస్తి ఉన్న ధనవంతుల జాబితాలో జోక్విన్ చోటు సంపాదించాడు. ఇతడు వందల కోట్ల డాలర్ల విలువైన కొకైన్, మారిజువానా, ఇతర మాదక ద్రవ్యాలను అమెరికాకు అక్రమంగా తరలించాడు.¤ ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) పరిపాలనా ట్రైబ్యునల్ అధ్యక్షురాలిగా లక్ష్మీస్వామినాథన్ ఎన్నికయ్యారు. ఈ కీలక పదవికి ఎన్నికైన తొలి భారతీయురాలు ఆమే. » 1991లో ఏర్పాటైన ఏడీబీ పరిపాలనా ట్రైబ్యునల్లో లక్ష్మీస్వామినాథన్ కంటే ముందు ఈ పదవిని చేపట్టిన వారిలో ఇద్దరు అమెరికన్లు, ఇద్దరు ఫిలిప్పీన్స్ దేశస్థులు, శ్రీలంక, బ్రిటన్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. » 2010లో లక్ష్మీస్వామినాథన్ ట్రైబ్యునల్ సభ్యురాలిగా నియమితులయ్యారు. 2013 నుంచి తాత్కాలిక అధ్యక్షురాలిగా విధులు నిర్వర్తించారు. » లక్ష్మీ స్వామినాథన్ గతంలో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ప్రధాన ధర్మాసనం వైస్ ఛైర్పర్సన్గా కూడా పనిచేశారు. |
ఫిబ్రవరి - 26
|
¤ నావికాదళం అధిపతి అడ్మిరల్ డి.కె.జోషి తన పదవికి రాజీనామా చేశారు. గత ఏడు నెలల్లో నావికాదళంలోని పలు యుద్ధ నౌకలు ప్రమాదాలకు గురి కావడంతో నైతిక బాధ్యత వహిస్తూ, ఆయన రాజీనామా చేశారు. జోషికి మరో 15 నెలల సర్వీస్ ఉంది. » జోషి రాజీనామాను అంగీకరించిన రక్షణమంత్రి ఎ.కె.ఆంటోని వైస్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్.కె.ధోవాన్ కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. |
ఫిబ్రవరి - 27
|
¤ ప్రముఖ న్యాయనిపుణులు ఫాలినారిమన్ లోక్పాల్ సెర్చ్ కమిటీలో భాగస్వామి అయ్యేందుకు నిరాకరించారు. » ఎనిమిది మందితో కూడిన ఈ కమిటీయే లోక్పాల్ ఛైర్పర్సన్, దాని సభ్యుల నియామకాల కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలించి, అర్హులనుకున్న వారి పేర్లను ఎంపిక కమిటీ (సెలక్షన్ కమిటీ)కి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. |
ఫిబ్రవరి - 28
|
¤ ఇటలీకి చెందిన అటురో లికాటాను గిన్నిస్ సంస్థ ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా గుర్తించింది. » ఫ్రిబ్రవరి 28 నాటికి ఆయన వయసు 111 సంవత్సరాల 302 రోజులు. |
|
|