ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెనను భారత్ ఎక్కడ నిర్మిస్తోంది - మీకు తెలుసా ?





 »      కాశ్మీర్‌లో ప్రపంచంలోనే ఎత్తైన  రైలు వంతెన చినాబ్ నదిపై నిర్మిస్తోంది. జమ్మూ-ఉధంపూర్-కట్రా-ఖ్వాజిగుండ్-బారముల్లాలను కలుపుతూ భారతదేశంలో నిర్మిస్తున్న ప్రపంచంలోనే అత్యంత పొడవైన చినాబ్ బ్రిడ్జి 2016 కల్లా పూర్తి కావస్తోంది.

chenab railway bridge కోసం చిత్ర ఫలితం
»      2003లో ఈ అతిపెద్ద బ్రిడ్జి నిర్మాణాన్ని మొదలుపెట్టారు.  ఈ బ్రిడ్జి యొక్క నిర్మాణం 359మీటర్ల ఎత్తు వద్ద పూర్తిచేస్తే అది ప్రపంచంలోనే ఎత్తైన ఈఫిల్ టవర్ కన్నా 35మీటర్ల ఎత్తులో ఉంటుంది.  
»      కేబుల్ క్రేన్ల సాయంతో తోరణాల మాదిరిగా ఉక్కు స్తంభాలను నిలబెట్టి వంతెనను నిర్మిస్తున్నారు. రహదారులు సరిగా లేకపోవడంతో భారీ వస్తువులను వంతెన వద్దకు తరలించేందుకు హెలికాప్టర్లను సైతం ఉపయోగిస్తున్నారు. 
chenab railway bridge కోసం చిత్ర ఫలితం
»      ఈ బ్రిడ్జి నిర్మాణం వలన బారాముల్లా నుండి జమ్మూకు గల 6గంటల 30నిమిషాల ప్రయాణ కాలం దాదాపు సగానికి తగ్గబోతోంది.
»      మొత్తం 25 వేల టన్నుల ఉక్కును వాడుతున్నారు. నదీప్రవాహానికి ఆటంకం లేకుండానే బ్రిడ్జిని నిర్మించడం అనేది పెద్ద సవాలుగా మారిందని అయినా, 2016 డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.


chenab railway bridge కోసం చిత్ర ఫలితం
»       ఈ బ్రిడ్జి నిర్మాణానికి దాదాపు 552కోట్ల రూపాయల వ్యయం అవుతోంది.  ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తై రైల్వే వంతెన చైనాలోని గిర ప్రావిన్స్‌లో బీపాన్‌జియాంగ్ నదిపై ఉంది. ఆ వంతెన ఎత్తు 275 మీటర్లు కాగా 84 మీటర్లు ఎక్కువ కానుంది. పారిస్‌లోని ఈఫిల్ టవర్ కన్నా కూడా 35 మీటర్లు ఎక్కువ పొడవు ఉంటుంది. భూకంపం వచ్చినా తట్టుకుంటుంది.
»      కొంకణ్ రైల్వే కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ వంతెనకు రూ. 552 కోట్ల వ్యయం కానుందని అంచనా.
»      ఇక ఈ బ్రిడ్జి నిర్మాణం గనుక పూర్తయితే ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్దదైన చైనా బ్రిడ్జిను అధిగమించి చీనాబ్ బ్రిడ్జి మొదటి స్థానానికి చేరుకుంటుంది.




0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment