| 1. క్రైస్తవ మత ప్రచారకుడైన అలెగ్జాండర్ డఫ్ చేసిన హిందూమత వ్యతిరేక ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టిందెవరు? |
| జ: దేవేంద్రనాథ్ ఠాగూర్ |
| 2. 'బ్రహ్మధర్మ' గ్రంథ రచయిత ఎవరు? |
| జ: దేవేంద్రనాథ్ ఠాగూర్ |
| 3. 'వేదాంత సూత్రాలు' గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించినవారు ఎవరు? |
| జ: వివేకానందుడు |
| 4. 'శుద్ధి ఉద్యమాన్ని' ఎవరు ప్రారంభించారు? |
| జ: దయానందుడు |
| 5. తత్వబోధిని సభను ఎప్పుడు ఏర్పాటు చేశారు? |
| జ: 1839 |
| 6 'ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్'ను ఎవరు స్థాపించారు? |
| జ: కేశవ్ చంద్రసేన్ |
| 7. 'ప్రార్థనా సమాజ్' ను ఎప్పుడు స్థాపించారు? |
| జ: 1867 |
| 8. ఆర్యసమాజం ప్రభావం ఏ రాష్ట్రంపై ఎక్కువ? |
| జ: పంజాబ్ |
| 9. శ్రద్ధానందుడు గురుకుల విద్యాలయాలను ఎక్కడ ప్రారంభించాడు? |
| జ: హరిద్వార్ |
| 10. రామకృష్ణ పరమహంస భార్య పేరేంటి? |
| జ: శారదాదేవి |
| 11. పశ్చిమ భారత పునరుజ్జీవన పితగా పేరుపొందినవారు ఎవరు? |
| జ: ఎం.జి.రనడే |
| 12. ఉత్తర భారతదేశపు హిందూ లూథర్గా ప్రసిద్ధి చెందినవారు ఎవరు? |
| జ: దయానందుడు |
| 13. ప్రజామిత్ర మండలి స్థాపకుడు ఎవరు? |
| జ: సి.ఆర్.రెడ్డి |
| 14. నాయర్ సర్వీస్ సొసైటీ స్థాపకుడు ఎవరు? |
| జ: మన్నత్ పద్మనాభ పిళ్లై |
| 15. 'నామ్ధారి ఉద్యమం' ఎప్పుడు ప్రారంభమైంది? |
| జ: 1857 |
| 16. వితంతు పునర్వివాహ చట్టం రూపకల్పనకు కృషి చేసినవారు? |
| జ: ఈశ్వరచంద్ర విద్యాసాగర్ |
| 17. హిందూ కన్యా విద్యాలయాలను ఎవరు స్థాపించారు? |
| జ: జె.ఇ.డి.బెత్యూన్ |
| 18. ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు ఎవరు? |
| జ: ఎం.జి.రనడే |
| 19. వితంతువులకు శారదా సదన్ పేరుతో పాఠశాలలను స్థాపించినవారు ఎవరు? |
| జ: పండిత రమాబాయి |
| 20. పుణెలో 1896లో 'విధవా సదన్' ఏర్పాటు చేసినవారు ఎవరు? |
| జ: ధొండొకేశవ్ కార్వే |
| 21. 1893లో కలకత్తాలో మహాకాళి పాఠశాలను ఎవరు స్థాపించారు? |
| జ: గంగాబాయి |
| 22. మద్రాసు ప్రెసిడెన్సీలో మొదటి హిందూ వితంతు గ్రాడ్యుయేట్ ఎవరు? |
| జ: సుబ్బలక్ష్మి |
| 23. అలహాబాద్లో 1910 లో 'భారత్ స్త్రీమహామండల్' ను ఎవరు ప్రారంభించారు? |
| జ: సరళాదేవి చౌధురాని |
| 24. 'ఉమెన్స్ ఇండియా అసోసియేషన్' ను స్థాపించిన ఐర్లండ్ వనిత ఎవరు? |
| జ: దొరోతి |
| 25. స్త్రీలకు ఓటుహక్కు కల్పించాలని మాంటేగ్ను డిమాండు చేసిన మొదటి సభ ఏది? |
| జ: ఉమెన్స్ ఇండియా అసోసియేషన్ |
| 26. పుణెలో 1927లో 'ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్' ఏర్పాటుకు కృషి చేసినవారు ఎవరు? |
| జ: మార్గరెట్ కజిన్స్ |
| 27. మద్రాసు శాసనమండలిలో నియమించిన మొదటి మహిళ ఎవరు? |
| జ: ముత్తులక్ష్మి రెడ్డి |
| 28. ఏ చట్టం స్త్రీలకు పరిమిత సంఖ్యలో ఓటు హక్కు కల్పించింది? |
| జ: 1935 చట్టం |
| 29. అలీగఢ్ ఉద్యమ స్థాపకుడు ఎవరు? |
| జ: సర్ సయ్యద్ అహ్మద్ఖాన్ |
| 30. 1887లో భారత జాతీయ కాంగ్రెస్కు ఎన్నికైన తొలి ముస్లిం అధ్యక్షుడు ఎవరు? |
| జ: బద్రుద్దీన్ త్యాబ్జి |
| 31. అలీగఢ్ పాఠశాలను ఎప్పుడు స్థాపించారు? |
| జ: 1875 |
| 32. సతీసహగమన నిషేధ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? |
| జ: 1829 |
| 33. 1873లో 'సత్యశోధక్ సమాజ్'ను ఎవరు ప్రారంభించారు? |
| జ: జ్యోతిబా పూలే |
| 34. 'శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం' సంస్థను ఎవరు స్థాపించారు? |
| జ: నారాయణ గురు |
| 35. మహర్, మాతంగ్లను ఏ రాష్ట్రంలో అంటరానివారిగా పరిగణించేవారు? |
| జ: మహారాష్ట్ర |
| 36. గాంధీజీ 'హరిజన్' పత్రికను ఎప్పుడు స్థాపించారు? |
| జ: 1933 |
| 37. మొదటి అఖిల భారత అణగారిన వర్గాల సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించారు? |
| జ: 1918 |
| 38. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఏ కులానికి చెందినవారు? |
| జ: మహర్ |
| 39. 1925లో ఆత్మగౌరవ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? |
| జ: ఇ.వి.రామస్వామి నాయకర్ |
| 40. బి.ఆర్.అంబేద్కర్ ప్రారంభించిన పత్రిక ఏది? |
| జ: బహిష్కృత్ భారత్ |
| 41. 1885లో 'సేవాసదన్' సంస్థను ఎవరు ప్రారంభించారు? |
| జ: బి.ఎమ్.మలబారి |
| 42. గోపాలకృష్ణ గోఖలే 'సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ' ని ఎప్పుడు ప్రారంభించారు? |
| జ: 1915 |
| 43. 1911లో ఎన్.ఎమ్.జోషి స్థాపించిన సంస్థ ఏది? |
| జ: సోషల్ సర్వీస్ లీగ్ |
| 44. లోకహితవాదిగా పేరుపొందినవారు ఎవరు? |
| జ: గోపాల హరిదేశ్ముఖ్ |
| 45. 'ద్రవిడ మున్నేట్ర కజగం' పార్టీని ఎప్పుడు స్థాపించారు? |
| జ: 1949 |