| తుపాను - I |
| 1. 'కత్రినా' అనే తుపాను (హరికేన్) వల్ల ఏ దేశంలో సుమారు 1836 మంది మరణించారు? |
| జ: అమెరికా |
| 2. 2008 లో తమిళనాడులో సంభవించిన తుపాను పేరేంటి? |
| జ: నిషా |
| 3. 1999 లో ఏ రాష్ట్రంలో సంభవించిన సూపర్ సైక్లోన్ వల్ల 8913 మందికి పైగా ప్రజలు మరణించారు? |
| జ: ఒరిస్సా |
| 4. పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్లో 5,00,000 మంది మరణానికి కారణమైన భోలా తుపాను ఎప్పుడు సంభవించింది? |
| జ: 1970 |
| 5. ఒక ప్రాంతంలో తుపాను వచ్చినప్పుడు జరిగే నష్టం ఏమిటి? |
| జ: వేగంగా వీచే గాలి వల్ల వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోతాయి; వరదలొచ్చి గ్రామాలు ముంపునకు గురవుతాయి; రోడ్లు, భవనాలు దెబ్బతిని ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతుంది. |
| 6. తుపాను సంభవించినపుడు కలిగే పరిణామాలేవి? |
| జ: గాలి అధిక వేగంతో వీస్తుంది; వర్షపాతం కలుగుతుంది; సముద్రంలో అలల ఉద్ధృతి పెరుగుతుంది. |
| 7. భారతదేశంలోని ఏ సముద్రంలో తుపానులు ఎక్కువగా సంభవిస్తాయి? |
| జ: బంగాళాఖాతం |
| 8. అరేబియా తీరప్రాంతంలో ఉండే ఏ రాష్ట్రాలకు తుపాను ముప్పు ఎక్కువ? |
| జ: గుజరాత్, మహారాష్ట్ర |
| 9. బంగాళాఖాతం తీరప్రాంతంలో ఉండే ఏ రాష్ట్రానికి తుపాను వల్ల కలిగే నష్టం ఎక్కువ? |
| జ: ఒరిస్సా |
| 10. భారతదేశంలో తుపాను విపత్తుకు గురయ్యే ప్రాంత పరిమాణం - |
| జ: 8.5% |
| వరదలు |
| 1. గంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలను నియంత్రించడానికి భారత ప్రభుత్వం గంగా ఫ్లడ్ కంట్రోల్ కమిషన్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది? |
| జ: 1972 |
| 2. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధీనంలో పనిచేసే 'నేషనల్ వాటర్ అకాడమీ' (NWA)ను ఏ నగరంలో నెలకొల్పారు? |
| జ: పుణే |
| 3. వరదల వల్ల రోడ్లు, రైల్వే లైన్లకు కలిగే నష్టాన్ని తనిఖీ చేయడానికి ఏ సంస్థలు పనిచేస్తున్నాయి? |
| జ: బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ , నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా , స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ |
| 4. వరద హెచ్చరిక, నదీ ప్రవాహం ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి అపాయకరమైన స్థాయి కంటే తక్కువగా ఉంటే ఆ ప్రవాహాన్ని ఏమంటారు? |
| జ: తక్కువస్థాయి వరద |
| 5. 2008లో బీహార్లోని ఏ నదికి వరదలు రావడం వల్ల 527 మంది మరణించారు? |
| జ: కోసి |
| 6. భారతదేశంలో ఎంత శాతం భూ భాగం వరద ముప్పునకు గురయ్యే అవకాశం ఉంది? |
| జ: 8% |
| 7. భారతదేశంలో ఏ నెలల మధ్యకాలంలో వరదలు వచ్చే అవకాశం ఎక్కువ? |
| జ: జూన్-సెప్టెంబరు |
| 8. భారతదేశంలో ఏ సంవత్సరంలో సంభవించిన వరదల ఫలితంగా అత్యధికంగా 11,316 మంది మరణించారు? |
| జ: 1977 |
| 9. మన దేశంలో వరదలు తరచుగా ఏ నదీ పరీవాహక ప్రాంతాల్లో వస్తుంటాయి? |
| జ: గంగా-బ్రహ్మపుత్ర |
| 10. ఏదైనా ప్రాంతంలో వరదలు రావడానికి కారణం- |
| జ: అధిక వర్షపాతం, తుపాన్లు , జలాశయాలకు గండ్లు పడటం , కొండచరియలు విరిగిపడటం, నదులు ప్రవాహ దిశను మార్చుకోవడం |
| 11. హైదరాబాద్, ముంబయి లాంటి నగరాల్లో వరదలు రావడానికి కారణమేమిటి? |
| జ: డ్రైనేజీలు ఘనపదార్థాలతో పూడుకుపోవడం |
| 12. బ్రహ్మపుత్రా నదీ ప్రాంతంలో ఉండే ఏ రాష్ట్రాల్లో అక్కడి నదుల వల్ల ఎక్కువగా వరదలు వస్తున్నాయి? |
| జ: అసోం, మిజోరం, అరుణాచల్ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్ |
| 13. జార్ఖండ్, బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ నది, దాని ఉపనదుల వల్ల వరదలు సంభవిస్తున్నాయి? |
| జ: గంగానది |