| 1. ఆధునిక భారతదేశ చరిత్రలో విప్లవ ఉద్యమానికి మూలపురుషులు (మహారాష్ట్రకు చెందిన వారు)- |
| జ: వాసుదేవ బల్వంత పాడ్కే |
| 2. భారతదేశంలో మొట్టమొదటి విప్లవ ఉగ్రవాద సంస్థ మహారాష్ట్రలో ప్రారంభమైంది. దానిపేరు- |
| జ: మిత్రమేళా |
| 3. 1897లో పుణే ప్లేగు కమిషనర్ 'రాండే'ను చంపింది- |
| జ: చాపేకర్ సోదరులు |
| 4. బెంగాల్లో స్థాపించిన మొదటి విప్లవ ఉగ్రవాద సంస్థ- |
| జ: అనుశీలన సమితి |
| 5. 'అనుశీలన సమితి ఆఫ్ ఢాకా'ను స్థాపించినవారు- |
| జ: పులీన్ దాస్ |
| 6. 'వందేమాతరం' అని అరచినందుకు, 15 ఏళ్ల సుశీల్ సేన్ను తన పర్యవేక్షణలో క్రూరంగా కొట్టించిన కలకత్తా మేజిస్ట్రేట్ కింగ్స్ఫోర్డ్పై హత్యాప్రయత్నం కేసులో (1908) ఉరితీయబడినవారు- |
| జ: కుదీరాంబోస్ |
| 7. 1908లో కలకత్తా సమీపంలోని మానిక్టోలా తోటలో బాంబులు తయారుచేస్తున్నట్లు పోలీసులు కనిపెట్టిన ఆలీపూర్ కుట్రకేసు లేదా ఆలీపూర్ బాంబు కేసులో ఉరితీతకు గురైన వారిని గుర్తించింది? |
| జ: కన్హయలాల్దత్తా, సత్యన్బోస్ |
| 8. ఆలీపూర్ కుట్రకేసులో నిందితుల తరఫున ఉచితంగా వాదించినవారు- |
| జ: చిత్తరంజన్దాస్ |
| 9. 1909 డిసెంబరులో నాసిక్ జిల్లా మేజిస్ట్రేట్ జాక్సన్ హత్యకేసులో యావజ్జీవ కారాగారశిక్షకు గురైన 'అభినవ భారత్' సభ్యులు- |
| జ: సావర్కర్ సోదరులు |
| 10. గణేశ్ సావర్కర్ను అరెస్ట్ చేయాల్సిందిగా జాక్సన్ను ప్రోత్సహించిన సర్ కర్జన్ వైలీని (లండన్లోని భారతీయ కార్యాలయంలోని ఉద్యోగి) చంపి, ఉరిశిక్షకు గురైనవారెవరు? (ఐరిష్ ప్రజలు ఈయనను మహా వీరుడిగా ప్రస్తుతించారు.) |
| జ: మదన్లాల్ డింగ్రా |
| 11. 1912లో ఢిల్లీలో వైశ్రాయ్ లార్డ్ హార్డింజ్-II పై బాంబులు వేసి, జపాన్కు పారిపోయినవారు- |
| జ: రాస్బిహారీ బోస్ |
| 12. లార్డ్ హార్డింజ్-II పై బాంబుల దాడిని బ్రిటిష్ ప్రభుత్వం 'ఢిల్లీకుట్ర కేసు'గా పరిగణించి, నలుగురిని ఉరితీసింది. అందులో ఒకరు- బ్రిటిష్ పరిపాలనను తుదముట్టించడమే చివరికోరిక- అని చెప్పారు. వారెవరు? |
| జ: అవధ్బిహారీ |
| 13. వారణాసి కుట్రకేసులో యావజ్జీవ కారాగారశిక్షకు గురైన బెంగాలీ యువకుడెవరు? |
| (అతడు ఉత్తరప్రదేశ్లో విప్లవోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించాడు. వైశ్రాయ్ లార్డ్ హార్డింజ్-II పై బాంబుదాడుల్లో నిందితుడు) |
| జ: సచిన్ సన్యాల్ |
| 14. ఒరిస్సాలోని 'బాలాసోర్' వద్ద సాయుధ పోరాటాలు నిర్వహించి, పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన |
| జ: ప్రముఖ విప్లవ యోధుడు- జతిన్ ముఖర్జీ |
| 15. 1911లో తిరునల్వేలి జిల్లా కలెక్టర్ 'ఆష్' హత్యకేసులో (తిరునల్వేలి కుట్ర) ప్రధాన నిందితుడై, ఆత్మహత్య చేసుకున్న వారు- |
| జ: వాంచీ అయ్యర్ |
| 16. దక్షిణ భారతదేశంలో ఏకైక విప్లవ సంస్థ- |
| జ: భారతమాత సంఘం |
| 17. విదేశాల్లో భారతీయ విప్లవకారులకు స్ఫూర్తినిచ్చినవారు- |
| జ: శ్యాంజీ కృష్ణవర్మ |
| 18. 'ది ఇండియన్ సోషియాలజిస్ట్' పత్రికను ఎవరు నిర్వహించారు? |
| జ: శ్యాంజీ కృష్ణవర్మ |
| 19. బెర్లిన్లో భారత్ స్వాతంత్య్రం కోసం విప్లవ కార్యక్రమాలు నిర్వహించినవారు- |
| జ: వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ |
| 20. విదేశాల్లో భారతీయ త్రివర్ణపతాకాన్ని ఎగురవేసిన మొదటి వ్యక్తిగా మేడమ్ కామా చరిత్ర సృష్టించారు. మరి ఆ సంఘటన ఏ దేశంలో జరిగింది? (1907లో) |
| జ: జర్మనీ |
| 21. ప్యారిస్లో విప్లవ ఉగ్రవాద కార్యక్రమాలు నిర్వహించిన మేడమ్ కామా ఏ జాతీయ నాయకుడి ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేశారు? |
| జ: దాదాభాయ్ నౌరోజీ |
| 22. గదర్పార్టీలో చేరిన రైతులు ఎక్కువగా ఏ మతానికి చెందినవారు? |
| జ: సిక్కు |
| 23. గదర్ పార్టీలో చేరిన ఆంధ్రకు చెందిన ప్రముఖ వ్యక్తి- |
| జ: దర్శి చెంచయ్య |
| 24. గదర్ అంటే- |
| జ: తిరుగుబాటు |
| 25. 1913లో అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరంలో స్థాపించిన గదర్ పార్టీకి చెందిన వారు- |
| జ: లాల హరదయాళ్, సోహన్ సింగ్ బంక్నా, రామచంద్ర భరద్వాజ్ |
| 26. కొమగటుమారు అనేది- |
| జ: జపాన్కు చెందిన నౌక |
| 27. 1866లో లండన్లో ఈస్టిండియా అసోసియేషన్ను స్థాపించినవారు- |
| జ: దాదాబాయి నౌరోజి |
| 28. 'వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ'కు సంబంధించింది- |
| జ: జిమ్మర్ ప్లాన్ |
| 29. సరికాని జత |
| విప్లవ స్థావరాలు - స్థాపన |
| ప్యారిస్ - మేడం కామా |
| వాంకోవర్ - తారక్ నాథ్ దాస్ |
| టోక్యో - లాలా హరదయాళ్ |
| జ: టోక్యో - లాలా హరదయాళ్ |
| 30. 1924 చిట్టగాంగ్ రైల్వే స్టేషన్ దోపిడీకి నాయకత్వం వహించింది- |
| జ: సూర్యసేన్ |
| 31. మొదటి జాతీయ విప్లవ సంఘం- |
| జ: హెచ్.ఆర్.ఎ. |
| 32. 1924లో కాన్పూర్లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ స్థాపనలో సంబంధం లేనివారు- |
| జ: చంద్రశేఖర్ ఆజాద్ |
| 33. 1925లో లక్నో సమీపంలో ప్రఖ్యాతిగాంచిన 'కకోరి రైలు దోపిడీ'లో నలుగురిని ఉరితీశారు. అందులో లేనివారు కిందివారిలో ఎవరు? |
| రాంప్రసాద్ బిస్మిల్ , అస్వకుల్లా ఖాన్ , రోషన్ లాల్ , జతీంద్రనాథ్దాస్ |
| జ: జతీంద్రనాథ్దాస్ |
| 34. హెచ్.ఆర్.ఎ. ను హెచ్.ఎస్.ఆర్.ఎ. గా మార్చినవారు- |
| జ: చంద్రశేఖర్ ఆజాద్ |
| 35. 1928లో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ చారిత్రక సమావేశం ఎక్కడ జరిగింది? |
| జ: ఢిల్లీ |
| 36. 1928లో సైమన్ కమిషన్ బహిష్కరణోద్యమంలో భాగంగా లాహోర్లో లాలా లజపతిరాయ్ను తీవ్రంగా కొట్టిన 'సాండర్స్'ను కాల్చి చంపినవారితో సంబంధం ఉన్నవారు (లాహోర్ కుట్రకేసు)- |
| జ: భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు |
| 37. 1929లో కార్మికులు సమ్మెచేసే హక్కును రద్దు చేయడానికి ఉద్దేశించిన వాణిజ్య వివాదాల బిల్లు (ట్రేడ్ డిస్ఫ్యూట్), కమ్యూనిస్టులను అణచివేయదలచిన 'పబ్లిక్ సేఫ్టీ' బిల్లును బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో కేంద్ర శాసనసభపై బాంబులు వేసినవారు- |
| జ: భగత్సింగ్, బతుకేశ్వర దత్తా |
| 38. లాహోర్ కుట్రకేసు నిందితులకు మరణశిక్ష అమలు జరిపిన సంవత్సరం- |
| జ: 1931 |
| 39. లాహోర్ జైలులో ఖైదీలకు కనీస సదుపాయాల కోసం 63 రోజుల ఉపవాసాన్ని కొనసాగించిన విప్లవనాయకుడు మరణించగా, కలకత్తాలో ఆయన మృతదేహాన్ని ఊరేగించినప్పుడు ఆరు లక్షలమంది జనం పాల్గొన్నారు. ఆ నాయకుడి పేరు- |
| జ: జతిన్దాస్ |