| 1. బెంగాల్లో కౌలుదార్ల చట్టం ఏ సంవత్సరంలో చేశారు? |
| జ: 1883 |
| 2. దక్కన్ రైతుల తిరుగుబాటు ఎవరికి వ్యతిరేకంగా జరిగింది? |
| జ: వడ్డీ వ్యాపారస్తులకు |
| 3. శాశ్వత భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? |
| జ: కారన్ వాలిస్ |
| 4. బ్రిటిష్వారు ఏకపక్ష స్వేచ్ఛా వ్యాపార విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? |
| జ: 1813 |
| 5. 19వ శతాబ్దంలో చెలరేగిన రైతు ఉద్యమాలన్నిటిలో అత్యంత ముఖ్యమైంది? |
| జ: నీలిమందు రైతుల తిరుగుబాటు |
| 6. నీలిమందు రైతుల తిరుగుబాటు ఎక్కడ జరిగింది? |
| జ: బెంగాల్ |
| 7. దీనబంధు మిత్ర ప్రసిద్ధ నాటకం? |
| జ: నీల్ దర్పన్ |
| 8. నీలిమందు కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? |
| జ: 1860 |
| 9. పాబ్నా రైతుల ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది? |
| జ: తూర్పుబెంగాల్ |
| 10. బెంగాల్ కౌలుదార్ల చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? |
| జ: 1883 |
| 11. 1879లో మహారాష్ట్రలో రామోషీ పేద రైతులు ఎవరి నాయకత్వంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు? |
| జ: వాసుదేవ బల్వంతపాడ్కే |
| 12. మోప్లా రైతు తిరుగుబాటు ఎక్కడ జరిగింది? |
| జ: కేరళ |
| 13. మోప్లా రైతులు ఏ మతస్థులు? |
| జ: ముస్లిం |
| 14. గాంధీజీ చేపట్టిన ఏ ఉద్యమంలో రైతులు ఎక్కువగా పాల్గొన్నారు? |
| జ: సహాయ నిరాకరణోద్యమం |